Friday, 31 July 2026 12:48:10 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం

Date : 30 July 2026 08:06 AM Views : 18

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై మధుసూదన్ దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన విద్యా సేవలను కొనియాడుతూ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిరుదు మధుసూదన్ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో సేవలందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గురువుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మధుసూదన్ అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం విద్యార్థులతో అనుబంధాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిల శ్రీనుబాబు, మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాహెందర్ రెడ్డి, ఎంఈఓ డి. లక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మోహన్ శర్మ, ఉపాధ్యాయుల సంఘాల జిల్లా, మండల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలతతో పాటు సహచర ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: