Friday, 31 July 2026 11:42:55 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సైబర్ నేరాలను, అవగాహనతోనే నివారణ సాధ్యం... సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలి..

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 14 February 2026 08:58 PM Views : 180

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు వివిధ నూతన పద్ధతులలో ప్రజలను మోసగిస్తున్న సందర్భాలలో ప్రజలకు అవగాహన, అప్రమత్త తప్పనిసరిగా ఉండాలని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూప్రజలు ఆర్థిక సైబర్ నేరాలకు మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన వెంటనే గ్రహించి ఫిర్యాదు చేసిన యెడల, మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏపీకే ఫైల్స్ ద్వారా మొబైల్ హ్యాకింగ్ పాల్పడుతూ, ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ ల ద్వారా మోసం చేస్తున్న తీరు ప్రబలిందని వాటిపట్ల అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నెరగాళ్లు ఐపిఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేస్తుంటారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫీజులు చెల్లించాలంటూ మోసం చేస్తుంటారని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని స్టాక్ మార్కెట్లో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసం చేస్తుంటారని. ఆన్లైన్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లను ఉంచి వాటి ద్వారా మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయంలో ఎలాంటి పత్రాలు లేకుండా తక్కువ రుసుముతో ఎక్కువ డబ్బును లోన్ ద్వారా అందిస్తామంటూ నమ్మబలికి మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈవారం సైబర్ క్రైమ్ నందు 16 ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. ఆదిలాబాద్ టు టౌన్ పరిధిలోని ఒకరికి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటూ లింకు ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి సైబర్ నెరవేర్లు లక్ష ఇరవై వేల రూపాయలను మోసం చేశారన్నారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్లో అమ్మాయి పరిచయమై తన ద్వారా 2.7 లక్షల రూపాయలను ఆన్లైన్ నందు ఇన్వెస్ట్ చేయించి, లాభాలు చూయించి, చివరికి డబ్బులను తీసుకుందామంటే రాకపోవడంతో మోస పోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేశారు. నకిలీ ఏపీకె ఫైల్స్ లింకుల ద్వారా పట్టణానికి చెందిన ఒకరు తన అకౌంట్ వివరాలను నకిలీ లింక్ నందు పొందుపరచడంతో తన అకౌంట్ నుండి 13వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించడం జరిగిం దని, ఉట్నూర్ కు చెందిన బాధితుని వద్ద ముద్ర లోన్ వచ్చిందని బాధితుని వద్దనుండి విడతలవారీగా ఫీజులు అంటూ 70 వేల రూపాయలను మోసం చేయడం జరిగిం దన్నారు. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఎలాంటి సమస్యలున్న జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు ఫిర్యాదులను నమోదు చేయాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :