ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లారాజంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్య మరియు వార్డ్ అభ్యర్థుల గెలుపు కోసం గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజలను కలిశారు. ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను (కల్యాణ బి.ఆర్.ఎస్ లక్ష్మి, రైతు బంధు, తదితర) వివరంగా వివరించారు. బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామా ప్రజలను అభ్యర్థించారు. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే గారు ప్రజలకు పూర్తిభరోసాకల్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్, కోవ సాయినాథ్, కార్యకర్తలు, నాయకులు గంధం శ్రీను, నిస్సార్ భాయ్, అన్సార్ భాయ్, చిలువేరు వెంకన్న, సాజిద్, ఉమారాణి, లలిత, సుప్రజ, సంగీత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News