Friday, 31 July 2026 07:12:39 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వం కల్పిస్తున్న విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..

ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

Date : 01 July 2026 09:46 PM Views : 48

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్నఅవకాశాలను విద్యార్థులుసద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు .బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న షెడ్యూల్డ్ తెగల బాలుర వసతి గృహ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్య బోధన అందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో చేపట్టిన వసతి గృహ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించి ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు.మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, మూత్రశాలల పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వంటశాలను పరిశీలించి కారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ పాఠశాలలలో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు.లక్షెట్టిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకుసూచించారు. వంటశాలను సందర్శించి విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, ఆహారం తయారీకి తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని సూచించారు.అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల కార్యదర్శులు, బూత్ స్థాయి అధికారులు, వాలంటీర్లకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీలో ముసాయిదా జాబితా రూపకల్పన ముఖ్యమని తెలిపారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సమగ్ర సవరణ ప్రక్రియలు భాగంగా 2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగిన వారి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తూ ప్రస్తుత సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 72 శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు ఫారం 6 తో పాటు డిక్లరేషన్ తీసుకుని ఓటు నమోదు చేయవచ్చని, ఓటు తొలగింపు, 2 అంతకంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగిన వారు ఒకే కార్డు ఉండేలా చూడాలని తెలిపారు. ఆన్లైన్ లో సైతం ఎన్యుమరేషన్ ఫారం నింపవచ్చని తెలిపారు.

ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత, చదువుకున్న వారు సహాయం అందించాలని, ఒకరు ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే కలిగి ఉండేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలని తెలిపారు. మరణించిన,గ్రామం వదిలి వెళ్ళిన,2 మించి ఓటరు కార్డులు కలిగిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత సేకరించి బి ఎల్ ఓ యాప్ లో డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని,నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు, జి.పి.ఓ. లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :