ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆదిలాబాద్ జిల్లాలోని కడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మాజీపేట మూలమలుపు వద్ద ఉన్న రహదారిపై చెట్లు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, ఇటీవల ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,కడెం పోలీసులు గ్రామస్తులకు అవగాహన కల్పించి, గ్రామ ప్రజల సహకారంతో రహదారి పక్కన ఏపుగా పెరిగిన చెట్లను సోమవారం తొలగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూరోడ్డు భద్రత అందరి బాధ్యత. ప్రజల సహకారంతో ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు . కడెం పోలీసులు చూపిన చొరవ ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ తెలిపారు.పోలీసులు, ప్రజలను రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు నివారించేందుకు అందరూ భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News