Friday, 31 July 2026 01:53:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

దొంగతనం కేసులో భార్యాభర్తల అరెస్ట్

బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం డిఎస్పి రఘు చందర్

Date : 06 February 2026 09:14 PM Views : 200

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.4,357/- నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్64/2026 కింద 331(4), 305(a) బి.ఎన్.ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై ఎం. సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి6 న కరీంనగర్ రోడ్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పంచల సమక్షంలో వారిని విచారించారు. విచారణలో వారు ఆలయంలో జరిగిన దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :