Friday, 31 July 2026 12:42:46 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అద్దె డబ్బులు చెల్లించలేదని గిరిజన కళాశాల భవనానికి తాళం వేసిన యజమాని

ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం పార్టీ నాయకులు

Date : 24 November 2025 09:53 PM Views : 195

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని లోని గిరిజన గురుకుల బాలికల కళాశాల భవనానికి 8 మాసాలుగా అద్దె డబ్బులు ఇవ్వటం లేదని యజమాని కళాశాల కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. సమాచారం అందుకున్న సిపిఎం పార్టీ నాయకులు కళాశాలను సందర్శించి రెవెన్యూ సిబ్బందితో కళాశాల సిబ్బంది, యజమానితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథనిలో విద్యావ్యవస్థ రాను రాను నిర్వీర్యం అవుతుందన్నారు. దళితులు, గిరిజనులు బడుగు బలహీన వర్గాల హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఏడు సంవత్సరాలుగా గిరిజన కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుందని, ఇంకా ఎన్ని సంవత్సరాలు గిరిజన విద్యార్థులు అద్దె భవనాలలో ఉండాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మాసాలుగా అద్దె డబ్బులు యజమానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు విద్యార్థులు సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కళాశాల భవనానికి తాళాలు వేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. విద్యార్థినులు రోడ్డుమీదికి వస్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలన్నారు. అద్దె డబ్బులు చెల్లింపు విషయంలో ఆర్ సి ఓ చేతివాటం ప్రదర్శిస్తున్నాడని అనుకున్న పర్సంటేజ్ ప్రకారం మామూలు ఇవ్వకుంటే అద్దె డబ్బులు చెల్లించడం లేదని ఆర్ సి ఓ పనితీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంత్రి స్పందించి ప్రభుత్వం నుండి రావలసిన అద్దె డబ్బులు విడుదల చేయాలని గిరిజన బాలికల కళాశాల భవనంతో పాటు ఇతర హాస్టళ్లకు పక్క భవనాలు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆయన వెంట సిపిఎం నాయకులు మంథని లింగయ్య, బాబు రవిలు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :