ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టలల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వర్కర్లకు 2022-23-24 విద్యా సంవత్సరం నందు మధ్యలో కొన్ని నెలలు గా ఏజెన్సీ నిర్వాహకులు వర్కర్లకు ప్రతినెలా చెల్లించే ఈపిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను చెల్లించలేదని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ 27-09-2025 న జిల్లా బీసీ వెల్ఫేర్,జిల్లా ఉపాధి కల్పన, లేబర్ అధికారులకు ఫిర్యాదు చేయడంజరిగింది.నేటికీ 5 నెలలు గడిచిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఎలాంటి చర్యల చేపట్టలేదన్నారు. జిల్లా అవుట్సోర్సింగ్ ఏంపనల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
E Nivas News