ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్ కోరారు. చీకట్లను తొలగించి వెలుగును అందించే పండుగ దీపావళి సందర్భంగా సిలివేరు అనిల్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే దీపావళి పండుగ పిల్లా పాపలు, తల్లిదండ్రులతో ఆనందంగా గడపుతూ సురక్షితంగా పండగను జరుపుకోవాలని కోరారు. సంతోషాలలో భాగంగా బాణసంచా కాలుస్తూ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా కాల్చుతున్న తరుణంలో చిన్న పిల్లలను చాలా దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. పండుగ సమయంలో మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. వీలైనంత తక్కువ టపాకాయలు కాల్చుకొని శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Admin
E Nivas News