ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీ లో పారిశుధ్యం పనులు వేగవంతం చేపట్టిన స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాడలో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. సిబ్బంది ప్రతి రోజూ పనుల నిమగ్నంలో ఉండాలని, మురికి కాల్వలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ఆదేశాలుండగా ఎక్కడ బడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ ఉండ కుండా చూసు కోవాలని పంచాయతీ కార్యదర్శికి తెలిపారు. సిబ్బందితో ప్రతి వాడకి పంచాయతీ కార్యదర్శి వెళ్లి పనులు నిర్వహించాలని సర్పంచ్ ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణలో జిల్లాలోనె ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్రల రాజయ్యతో పాటు గ్రామ ప్రజలు మంతెన రాజ య్య.ఎలా చిన్న య్య, మంతెన వెంకట్, మంతెన అన్వేష్, మురుకుట్ల నవీ న్, మంతెన రమేషు, పందుల చంద్రయ్య, ఎలా రాములు పాల్గొన్నారు.
Admin
E Nivas News