Friday, 17 April 2026 05:11:24 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలు ఇద్దరు అరెస్ట్..! పాత మొబైల్ ఫోన్లు పట్లజాగ్రత్తలు పాటించాలి

ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

Date : 22 February 2026 02:39 PM Views : 61

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద పాత కీప్యాడ్ మొబైల్ ఫోన్లు సేకరిస్తూ, వాటి ద్వారా భారీ ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులు పాత మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిలోని డేటా, సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లు సేకరించి, బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ అమాయక ప్రజలను ఓటిపి లు అడిగి మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకునేవారని విచారణలో వెల్లడైం దన్నారు. స్క్రాప్ మొబైల్ భాగాలను హైదరాబాద్‌లో విక్రయిస్తూ లాభం పొందుతున్నట్లు నిందితులు అంగీకరించినట్టు తెలిపారు. పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు యాక్టివా స్కూటీ - 1, రెండు స్మార్ట్ ఫోన్లు, 20 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, 38 మొబైల్ బ్యాటరీలు, మొబైల్ విడిభాగాలు జప్తు చేశామన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారన్నారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ సూచించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. పాత మొబైల్ ఫోన్లను అమ్మే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలని గుర్తుతెలియని వాళ్ళకి అమ్మ వద్దని తెలిపారు. అదే విధంగా మొబైల్ షాప్ యజమానులు మొబైల్ ను కొనుగోలు చేసే ముందు యజమానుల ధ్రువపత్రాలను మరియు సరైన బిల్లులను సరిచూసుకొని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :