Friday, 31 July 2026 04:58:46 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రాంప్ ద్వారా మహిళలకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణ మద్దతు...

అదనపు కలెక్టర్ (రెవెన్యూ)పి.చంద్రయ్య

Date : 25 February 2026 11:08 PM Views : 266

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాంప్ మహిళా త్వరణ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎం. ఎస్. ఎం. ఈ. లకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణం మద్దతును అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య లతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళ వ్యవస్థాపకులకు ఐ టి ఈ - సి విభాగం, వీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించినఅవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, భారత ఎంఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ మద్దతుతో రాంప్ ద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎంఎస్ఎమ్ఈ నిర్మాణాత్మక వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. 2 సంవత్సరాల ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార వృద్ధిని వేగవంతం చేసేందుకు, వారి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం అందిస్తుందని తెలిపారు. వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, తయారీ, హస్త కళలు, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలోని సంస్థలు, వ్యాపార నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి, వైవిధ్యేకరణ, బ్రాండింగ్, మార్కెట్ ఆక్సెస్, క్రెడిట్ లింకేజ్ లకు నిపుణుల మార్గదర్శకత్వంలో మద్దతు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసక్తి గల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం నాన్ ఫామ్ సారయ్య, వి హబ్ సంచాలకులు జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా, డా. సల్మాన్, అబిద్, శ్రీకర్,ఈ డి సి ప్రశాంత్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :