ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమ్నాయ వర్ధిని కమిటీ నిర్వాహకులు ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచాభిషేకం, సుదర్శన హోమం కార్యక్రమం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 17 నుండి జనవరి 15 వరకు నెల రోజులపాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సహస్ర దీపార్చన కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంతో మహిమాన్వితం కలిగిన ఈ దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరసిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తల్లం శ్రీనివాస్, నల్లగొండ శ్రీనివాస్, శ్రీరంభట్ల నరహరి, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం (లచ్చు), అవధానుల శ్రీనివాస్, విష్ణుదాస్, రామడుగు సాయి శ్రీనివాస్, భయ్యాగారి రాజు, గులుకోట శ్రీకాంత్, మహావాది కృష్ణమోహన్, శ్రీరంభట్ల సంతోష, గొలుగుల శ్రీదేవి, తపిలిస్ట్ రాజేశం, ఆలయ పూజారి తిరువరంగం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News