Friday, 31 July 2026 09:57:01 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కన్నుల పండువగా అయ్యప్ప స్వామి శోభయాత్ర...

Date : 27 December 2025 12:39 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు అయ్యప్ప స్వామి శోభ యాత్రను మంథని పుర వీధుల గుండా వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ఉదయం అరట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంథని గోదావరి నది తీరంలో ఉదయం స్వామి ఉత్సవ విగ్రహానికి దీక్ష పరులంతా చక్ర స్నానాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఆనంతరం ట్రాక్టర్‌పై ప్రత్యేకంగా ఆలంకరించిన మండపంలో వివిధ రకాల పూలతో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఎరుకలగూడెం, బస్టాండ్‌, అంబేద్కర్‌క్‌,గాంధీక్‌, పెంజేరుకట్టల మీదుగా ఆలయం వరకు స్వామి శోభయాత్రను దీక్షా పరులు, భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పాటలకు దీక్షా పరులు ఆనందోత్సవాల మధ్య భజనలు చేస్తూ స్వామిని స్మరిస్తూ పాటలు పాడారు. శోభయాత్రలో వెళ్తున్న స్వామి వారిని భక్తులు దర్శించుకోవడంతో పాటు కానుకలు, హారతులిస్తూ, కొబ్బరి కాయలు కొడుతూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శోభయమానంగా జరిగిన స్వామి వారి ఊరేగింపులో పూజారులు నాగేంద్రశర్మ, భద్రయ్య, దీక్షా పరులు వొడ్నాల శ్రీనివాస్, ఎంఎస్.రెడ్డి, కంది కృష్ణారెడ్డి, మిట్ట చంద్రయ్యలతో పాటు పలువురు దీక్షా పరులు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :