Friday, 17 April 2026 05:09:58 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

జగన్ ప్లాన్ అమలు చేస్తున్న జీవన్ రెడ్డి..

ఫలిస్తుందా పెద్దమనిషి కోరిక..

Date : 23 March 2026 09:41 PM Views : 115

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం బహిర్గతమే. ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంపై రగిలిపోతున్న జీవన్ రెడ్డిఇప్పుడు పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగాఏదో పార్టీ మారిపోయి కండువా కప్పుకుంటే ఎఫెక్ట్ రాదనికొత్తగా ప్రయత్నిస్తన్నారు. జగన్ రెడ్డి ప్లాన్ ను అడాప్ట్ చేసుకుని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి యాత్ర చేయనున్నారు. గతంలో వైఎస్ జగన్ తనకు కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిందనే సెంటిమెంట్‌తో ఎలాగైతే ప్రజల్లోకి వెళ్లారో, ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. మార్చి 25న అధికారికంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, గ్రామ గ్రామాన తిరుగుతూ తన ఆవేదనను ప్రజలకు వివరించి, సానుభూతిని కూడగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే తన తదుపరి రాజకీయ అడుగులపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను విస్మరించిందనే పాయింట్‌ను బలంగా వాడుకుంటూ, ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం ద్వారా తనఉనికినిచాటుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఆయన ఏ జెండా పడతారనేది జగిత్యాల నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వయసు భారంతో పాటు రాజకీయ అనుభవం ఉంది. ఇక్కడ ప్రధానమైన చర్చ జీవన్ రెడ్డి వయసు, ఆయనకున్న ప్రజాదరణ గురించి సాగుతోంది. జగన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్‌ను మార్కెటింగ్ చేసుకుని యువకుడిగా దూసుకుపోయారు. కానీ, జీవన్ రెడ్డి వయసు ప్రస్తుతం 75 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఆయనకు ఈ పోరాటం అవసరమా అనే ప్రశ్న సామాన్య జనం నుండి వినిపిస్తోంది. జగిత్యాల ప్రజలకు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుసు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఆయన పడుతున్న ఆవేదన మధ్య ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తారనేది కీలకం అయ్యింది. వయసు మళ్లిన వేళ ఆయన చూపే ఈ సెంటిమెంట్ కార్డ్ ఎంతవరకు పనవుతుందనేది అవుతుందనేది సందేహంగా మారింది. రాజకీయంగా పోరాడటానికే సిద్ధం.. రాజకీయాల్లో పట్టుదల ఉండటం మంచిదే కానీ, అది కాలం చెల్లిన వ్యూహాలతో సాగితే ఫలితం ఆశించినట్లు ఉండదు. జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి పునరుజ్జీవం పోయాలనుకుంటున్న ఈ ప్రయత్నం, ఆయనను మళ్ళీ హీరోగా నిలబెడుతుందా లేకరాజకీయ విరామానికి దారితీస్తుందా అనేది చూడాలి. సెంటిమెంట్‌ను నమ్ముకుని ఆయన చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూస్తారన్నది ఆసక్తికరంగా మారింది.నియోజకవర్గంలో ఆయనకున్న పాత కేడర్ ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నప్పటికీ, తటస్థ ఓటర్ల తీర్పు మాత్రం జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :