Friday, 17 April 2026 05:02:24 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

విద్యతోపాటు క్రీడలు చాలా అవసరం...

ట్రినిటీ పాఠశాలలో వార్షిక క్రీడోత్సవాల్లో ఎంపీ

Date : 06 January 2026 05:21 PM Views : 143

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ పాఠశాలలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో పాటు జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎంపీ పాఠశాలకి రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడేవాడిని. క్రీడలు జీవితం లో ఒక భాగం. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి” అని తెలిపారు. అలాగే గెలుపు–ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించే మనస్తత్వం క్రీడల ద్వారా వస్తుందని, టీమ్ స్పిరిట్ అలవడుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని, క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడడంతో నిజ జీవితంలో వచ్చే ఆటుపోట్లు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని ఎంపీ అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవన భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ హరికృష్ణ , డీసీసీ మాజీ సెక్రటరీ నల్ల రవి తదితర నాయకులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలను ఎంపీ తిలకించి, విజేతలైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :