ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం మంచిర్యాల జిల్లా ఇన్చార్జి డిటి డిఓ రమాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల లో విద్యార్థులకు అందిస్తున్న వసతులతో పాటు పౌష్టికారమైన భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో పదవ తరగతిలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారని వారు వార్షిక పరీక్షలు రాస్తున్నారని వారందరూ కూడా ప్రథమ శ్రేణిలో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులు మిగతా మూడు పరీక్షలకు విద్యార్థులను పరీక్షలు రాయడానికి సన్నద్ధం చేయాలని తెలిపారు. ఇప్పటివరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలు రాశారని మిగతా గణితం, బయాలజీ,ఫిజిక్స్, సోషల్ పరీక్ష లు విద్యార్థులు శ్రద్ధగా చర్యల సంబంధిత ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన పలు రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ సురేష్, ఏసీఎంవో లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయుడు రంగు సత్యనారాయణ జిల్లా గిరిజన క్రీడల అధికారిబండ జీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేవతి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News