ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు లేరనే సాకుతో డిగ్రీ కళాశాలను ను నిర్మల్ తరలించిన విద్యా శాఖ అధికారులు తరలించారని పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీ డిగ్రీ కళాశాల ను మంచిర్యాల లోనే కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను కోరడం తో తిరిగి మంచిర్యాలలోనే డిగ్రీ కళాశాలను కొనగిస్తున్నారు. విద్యార్థుల కష్టాలను తెలుసుకొని వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీకి ధన్యవాదాలు తెలిపి శాలువాతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిం దన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు పక్కాభవనాలు నిర్మించకపోవడంతో రాష్ట్రంలోని చాలా గురుకులాలు అద్దె భవనాలను కొనసాగిస్తున్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకో లేదన్నారు. గత బిఆర్ఎస్ సర్కార్ కు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదు. కాలేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుకుంటే మిషన్ భగీరథ, గత ప్రభుత్వ పథకాల్లో అన్నింటిలో కమిషన్లు దండుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలను ప్రైవేట్ బిల్డింగ్స్ లో కొనసాగిస్తూ కోట్ల రూపాయల రెంట్లు మాట్లాడుకుని కమిషన్లు దోచుకున్నా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యకు మంచి ప్రియారిటి ఇచ్చి విద్యారంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. విద్యాసంస్థలకు పక్కా భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. చదువుతోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మీ వెంట నేనుంటా - పెద్దపల్లి ఎంపీ వంశీ క్రిష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News