Friday, 31 July 2026 06:20:42 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

దండేపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆగ్రహం

Date : 04 December 2025 07:44 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మంచిర్యాల జిల్లానామినేషన్ విత్‌డ్రా ప్రక్రియలో జరిగిన అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి నామినేషన్‌ను విత్‌డ్రా చేయడానికి కాంగ్రెస్ నాయకుల అండతో దండేపల్లి ఎస్ఐ ప్రోత్సాహం చూపించారని ఆరోపించారు. విత్‌డ్రా సమయం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినా, 4:20 గంటలకు ఎన్నికల కార్యాలయం వెనక ద్వారం తెరిచి విత్‌డ్రా ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమయంలో లోపలే ఉన్న బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఎస్ఐ బెదిరింపులకు దిగారని ఆయన తెలిపారు. “ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తున్నారు, ఇది సరికాదు అని మా నాయకులు అడిగితే, మీపై కేసులు పెడతాను అంటూ భయపెట్టారు” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే 4:38 గంటలకు జిల్లా కలెక్టర్‌ను ఫోన్ చేసి వివరించానని దివాకర్ రావు చెప్పారు. “మూడుగంటల లోపే వచ్చారనీ, వెరిఫికేషన్ కోసం పిలిచామని కలెక్టర్ మెసేజ్ పంపారు” అని వివరించారు. తరువాత 5:04 గంటలకు మళ్లీ మాట్లాడగా విత్‌డ్రా ఆమోదించలేదని తెలిపారు. అయితే సాయంత్రం 7:38 గంటలకు మరోసారి సంప్రదించినప్పుడు ‘మీ అభ్యర్థి పోటీలో ఉన్నారు, ఎవరో తప్పు సమాచారం ఇస్తున్నారు’ అని సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. కానీ రాత్రి 9 గంటలకు తిరిగి ఫోన్ చేసి ఎన్నికల అధికారి విత్‌డ్రా ఆమోదించారు. వారి నిర్ణయాన్ని మార్చలేను, కానీ కోడ్ ఉల్లంఘనపై ఆర్వోపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని కలెక్టర్ వెల్లడించారని దివాకర్ రావు తెలిపారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీకే అనుకూలంగా పనిచేస్తున్న దండేపల్లి ఎస్సై, ఎన్నికల అధికారి ( ఆర్వో) ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టిబీజీకేఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :