ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని అయ్యప్పవాడలో బుధవారం ఉదయం నాలుగు గంటలకు కాలనీ వాసులు భోగిమంటల ఏర్పాటు చేసి పూజారి మడుగుల నాగరాజు శర్మతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక సర్పంచ్ పంతకాని సడలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా వాడ ప్రజలందరికీ భోగి, అడ్వా న్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తనన్ను ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ వాడ వాసులందరూ ఆయురా రోగ్యా లతో సుఖ సంతోషాలతో జీవించాలని దేవుని ప్రార్థించారు. ప్రతి సంక్రాంతి పండుగ పురస్క రించుకొని భోగి మంట లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి కొండ గొర్ల బానయ్య, వార్డు మెంబర్ కొండ రాజమల్లు, అయ్యప్ప వాడ వాసులు పడకంటి అంజలి ప్రకాష్, కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Admin
E Nivas News