Friday, 31 July 2026 01:24:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజల సహకారంతోనే టీబీ రహిత సమాజం సాధ్యం...

వైద్యాధికారి సతీష్ కుమార్

Date : 13 March 2026 12:21 AM Views : 225

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు .గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల మూడో వార్డులో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలం లోని కొత్తూర్ గ్రామాన్ని ఇటీవల టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా రెండవ విడత కార్యక్రమంలో అనుమానితులందరికీ ప్రజల వద్దకే వెళ్లి పోర్టబుల్ మోబైల్ ఎక్స్ రే ద్వారా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు , బిపి , షుగర్ వున్నవారు , గుట్కా, అంబార్ తోపాటు బీడీ , సిగరెట్, మద్యం సేవించేవారు మరియు గతంలో క్షయ వ్యాధి సోకినవారి కుటుంబ సభ్యులు తప్పని సరిగా ఈ వైద్య శిభిరాలలో పరీక్షలు నిర్వహించుకుని వ్యాధి నిర్ధారించుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మహాలక్ష్మి వాడ లో మరియు ఈ రోజు ఇటిక్యాల వార్డులో రేపు ఊత్కూర్ ఏరియా లో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ కోరారు. గురువారం ఇటిక్యాల లో 90 మందికి ఎక్స్ రే పరీక్షలు 20 మందికి తెమడ పరీక్షలు,100 మందికి షుగర్, బీపి తోపాటు సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్ ,ఎంఎల్ హెచ్ పి అంజలి , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం లు విజయదర్షిణి, చిలకమ్మ మరియు ఆశావర్కర్స్ హైమవతి, విజయ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :