Friday, 17 April 2026 05:03:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

సెంట్రింగ్ యూనిట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

డిఆర్డిఓ రాథోడ్ రవీందర్

Date : 29 October 2025 07:10 PM Views : 183

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సెంట్రింగ్ యూనిట్ శిక్షణను సద్వినియోగం చేసుకునే మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రధాన్యత కల్పిస్తామని ఆదిలాబాద్ జిల్లా డిఆర్డిఓ రాథోడ్ రవీందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారిచే స్వయం సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆరు రోజుల శిక్షణలో కార్యక్రమంలోభాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా హాజరైన డి ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ. శిక్షణకు హాజరైన మహిళా సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ఒక అదృష్టంగా భావించాలన్నారు.ఈ శిక్షణను సక్రమంగా వినియోగించుకుంటే రాబోయే మూడు సంవత్సరాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు. సెంట్రింగ్ నిర్మాణం కోసం కావలసిన సామాగ్రి ముడి సరుకుల కోసం బ్యాంకు స్త్రీ నిధి మండల సమాఖ్య పీఎంఈజీపి పథకాల కింద ఆర్థిక సహాయం అందించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని శిక్షణకు హాజరైన స్వయం సహాయక సంఘ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు. భరోసా ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ఎంపీడీవోకు శిక్షణ పొందిన వారి యొక్క వివరాలను అన్ని మండలాల ఎంపీడీవోలకు పంపించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత కల్పించడానికి ఒక సరుకులర్ జారీ చేస్తామన్నారు. సెంట్రింగ్ యూనిట్ శిక్షణను నేషనల్ కాంట్రాక్షన్ ఆఫ్ అకాడమీ ట్రేైనర్ పి మహేష్ శిక్షణకు హాజరైన మహిళలకు వారి కుటుంబ సభ్యులకు సెంట్రింగ్ నిర్మాణ పనులలో ఇన్ని రకాల సెంట్రింగ్ ఉంటుంది వాటిని ఏ విధంగా వాడాలి నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలో వివరించారు. శిక్షణకు హాజరైన వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా శిక్షణ శిక్షకులకు వివరించారు. అనంతరం ఈ శిక్షణకు తీసుకుంటున్న మహిళలకు వారి కుటుంబ సభ్యులకు సెంట్రింగ్ నిర్మాణం సమయంలో భద్రత కోసం కావలసిన హెల్మెట్ డ్రెస్ సామాగ్రి భద్రపరచడానికి కావలసినటువంటి బ్యాగ్ ని టూల్స్ ని ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్. న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ పి స్వప్న రాణి చేతుల మీదుగా శిక్షణకు హాజరైన వారికి అందజేశారు. అనంతరం శిక్షణ తీసుకుంటున్న వారితో ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ జాదవ గోవిందరావు నాన్ ఫామ్ డిపిఎం వెంకట్ సాయి ప్రసాద్ ఫామ్ ఏపిఎం రా పెళ్లి స్వామి ఎస్విఈపి ఏపీఎంలు మాధవ్ రావు పవర్ గణేష్ న్యాక్ సిబ్బంది రామ్ నారాయణ రమేష్ దీపక్ శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :