ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం పనులఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మ,ఎస్పీ సంకీర్త్ కలి సి పరిశీలించారు.ఈసంద ర్భంగా సభా స్థలం,హెలి ప్యాడ్,పార్కింగ్ ప్రాంతాలు మరియు సభా వేదికను వా రు సమగ్రంగా తనిఖీ చేశా రు.సభ ప్రాంగణంలో ఏర్పా టు చేస్తున్న బారికేడ్లు,స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగివివరాలుతెలుసుకున్నారు.పార్కింగ్సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలె క్టర్,అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహ నాల నిలుపుదల సౌకర్యా న్ని విస్తరించాలని సూచిం చారు.హెలిప్యాడ్ను పరిశీ లించినసందర్భంగా,దుమ్ముఎగరకుండా నీరు చల్లడం తో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధి కారులకు ఆదేశాలు జారీచే శారు.ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,అ దనపు కలెక్టర్లు అశోక్ కు మార్,విజయ లక్ష్మి,ఆర్ & బి.ఈ.ఈ.రమేష్,డీఎస్పీ సూర్యనారాయణ,సీఐలు,ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News