ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2029 లో జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 2034 ఎన్నికల్లో సైతం మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ భైరవుడి సంకలో చేరి నువ్వు ప్రజాపాలన పోవాలి, కెసిఆర్ పాలన రావాలి మాట్లాడతావా అని జీవన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఒక సంవత్సరం పదవి లేకుండా ఆగలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలను కూడా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం నువ్వు డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని ఇచ్చావో నాకు తెలవదా అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావని అవి నిర్మించిన అనతి కాలంలోనే పిల్లర్లు కృంగిపోయాయని వాటిని ఇప్పుడు మరమ్మత్తు చేసే బాధ్యత నా పైన పడిందని అయినా కూడా మొక్కవోను ధైర్యంతో మళ్లీ వాటిని ధరితగర్జన రిపేరు చేయిస్తానని అందుకోసమే మేడిగడ్డ రావడం జరిగిందన్నారు.
ఎన్డీఏ చైర్మన్ అనిల్l జైన్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం ఏడో బ్లాక్ వద్ద వెళ్లి పనులను పరిశీలించారు. చేస్తున్న పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అలాగే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వివేక్ పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ ఎంపీ గడ్డం వంశి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News