Friday, 31 July 2026 10:37:12 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు

Date : 30 January 2026 05:49 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హమాలి సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు కలిసి పులిహోర ప్యాకెట్, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవల ను, ఆయన అహింస మార్గాన్ని కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. వాసవి క్లబ్ కాటా రం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆ యుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ అని అన్నాడు. సర్వజన హితం నామతం. అంటరానితనాన్ని అంత కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతి పిత మహాత్మాగాంధీ సందేశం ఇచ్చారని, నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం గ్రామ సర్పంచ్ పంత కాని సడవలి, ఉప సర్పంచ్ కొండగొర్ల బానయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్, కోశాధికారి దారం నందకిషోర్, వాసవి క్ల బ్ కాటారం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్, ప్రధాన కార్యదర్శి అల్లాడి ఓం ప్రకాష్, కోశాధికారి మద్ది సంపత్, ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :