Friday, 31 July 2026 07:54:11 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

స‌జావుగా ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌ల నిర్వహణ..! అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తి ఏర్పాట్లు

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 10 February 2026 09:14 AM Views : 201

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ).. నాలుగు నోటిఫికేష‌న్ల‌కు సంబంధించి నిర్వహిస్తున్న ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రుగుతున్నాయ‌ని, అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. న‌గ‌రంలోని సీవీఆర్ బాలిక‌ల న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల ప‌రీక్షా కేంద్రాన్ని సంద‌ర్శించారు. అభ్య‌ర్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ అట‌వీ, ఎండోమెంట్ శాఖ‌ల‌కు సంబంధించి వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంద‌ని, ఇవి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌న్నారు. విజ‌య‌వాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లోని 15 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని.. సీటింగ్ అరేంజ్‌మెంట్‌, ఫ‌ర్నిచ‌ర్‌, తాగునీరు, మ‌రుగుదొడ్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇలా వివిధ అంశాల్లో ఎక్క‌డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. లైజ‌నింగ్‌, చీఫ్ సూప‌రింటెండెంట్లతో పాటు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టి కృషితో ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఆదేశాలిచ్చామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు దిశానిర్దేశం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి భద్రత మ‌ధ్య పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :