Thursday, 30 July 2026 06:09:43 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై ఆవేదన

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 23 December 2025 08:40 PM Views : 284

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలచివేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.మెట్ల దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్‌స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. టాయిలెట్ ఇన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కమోడ్లు, మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, కాళ్లకు గాయాలయ్యే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండాకనీసం ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మెట్టు వద్ద భక్తులు బస్సులు, కార్ల మధ్య నుంచి ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సి వస్తోందని, ఇది భక్తుల భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి, తిరుమల మెట్ల మార్గంలో తక్షణమే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.భక్తుల భద్రత, శుభ్రత, గౌరవంతో దర్శనం జరగడం అత్యంత ప్రాధాన్యమని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగడం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :