Friday, 31 July 2026 02:35:23 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సమష్టి గా పని చేయండి...! మరిపెడ మున్సిపల్ బీఆర్ఎస్ దే

మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్

Date : 07 January 2026 01:44 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతో పాటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుందని మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారని స్పష్టం చేశారు. అదే స్పూర్తి తో పురపాలక ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండే నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ మే నని స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలతో సుస్థిరమైన అభివృద్ధి చేయటం జరిగింది అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఇండోర్ స్టేడియం తలమానికంగా మారిందని, మున్సిపల్ పార్కు, మరిపెడ ఎస్సీ కాలనీ లో వ్యాయామ శాల, పల్లె, పట్టణ ప్రగతి పనులు, సెట్రల్ లైటింగ్ తో మరిపెడ దేదీప్యమానంగా కాంతులీ నిందని తెలిపారు. చేసిన ప్రగతి ని ప్రజల ముందు ఉంచి ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. మరిపెడ పురపాలిక సునాయసంగా బీఆర్ఎస్ పార్టీ గెలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డీఎస్ రవి చంద్ర, ఆయుబ్ పాషా, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల వెంకటేశ్వర్లు, గంట్ల మహిపాల్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల సతీష్, ఏరసాని రమణారెడ్డి, వెర్మా రెడ్డి రమేష్ రెడ్డి, ముదిరెడ్డి రంగారెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, మధు, నరేష్, పానుగోతు వెంకన్న,సయ్యద్ లతీఫ్, మక్సుద్ద్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, చిదుముల సంతోష్, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :