Friday, 17 April 2026 05:01:37 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లా స్థాయి క్రీడా పోటీలు

జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

Date : 02 December 2025 08:50 PM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగులదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లామహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలకు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ లతో కలిసి హాజరై జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం ద్వారా వారిలోఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ క్రీడాకారులు పోటీలలో నైపుణ్యం ప్రదర్శించాలని, జిల్లాలోని దివ్యాంగులకు జూనియర్స్ (18 సం.ల లోపు బాల బాలికలకు వేరువేరుగా), సీనియర్స్ (18 సం.ల నుండి 54 సం.ల వరకు మహిళలు, పురుషులకు వేరువేరుగా) వివిధ విభాగాలలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్యిలో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అంధులకు రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, బధిరులకు రన్నింగ్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు షార్ట్ పుట్, జావెలిన్ త్రో, క్యారమ్స్, బుద్ధి మాంద్యం దివ్యాంగులకు రన్నింగ్, షార్ట్ పుట్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :