ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమక్క గ్రామంలో కోరెంగ మాన్కుబాయి, దేవరావు దంపతులు మూడు రోజుల వ్యవధిలో అనారోగ్యంతో మృతి చెందారు. సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క-భుజంగరావు దంపతులు మృతుల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు తమ బంధువులే కావడంతో సుగుణక్క తీవ్ర విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Admin
E Nivas News