Friday, 31 July 2026 01:50:21 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చదువు విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది....

ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్...

Date : 18 November 2025 07:25 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : చదువు విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుందని యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఇన్చార్జి బియాల దినేష్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ తిరుపతి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే జామెంట్రీ బాక్స్ అందించిన ఫౌండేషన్ వారిని అభినందించారు. అనంతరం ఫౌండేషన్ ఇన్చార్జి బియ్యాల దినేష్ మాట్లాడుతూ చదువనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని చదువు మానవ జీవితంలో వెలుగును నింపుతుందన్నారు. చదువుతో పేదరికాన్ని దూరం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా వంతు సహాయంగా జామెంట్రీ బాక్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, గడ్డం మహేష్, తోట రవీందర్, వంశీ, సాయి, వాసు, ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ, కరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :