ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయేది మా ప్రభుత్వమేనని రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగి వేసారి పోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ బి.ఆర్.ఎస్ ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసిఆర్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాక ఎవరికైనా న్యాయం జరిగిందా ఏమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టారా అని మాట్లాడుతుండగానే సభలో జనమంతా ఏం చేయలేదంటూ నినాదాలు చేశారు. మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన ప్రభుత్వమే రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన జీవన్ రెడ్డి ఈరోజు టిఆర్ఎస్ లో చేరతానంటే నేను వద్దంటానా అని నా మనిషి కాబట్టి ప్రభుత్వం వచ్చాక కీలక బాధ్యతలు అప్పజెప్పతానన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని గెలిపించండి. జీవన్ రెడ్డి తక్కువ మనిషి కాదని ఒక శక్తి అన్నారు. అన్ని డూప్లికేట్ సర్వేలు చేశారని అందులో నిజం లేదన్నారు. తెలంగాణలో యుద్ధం నేన్ చేస్తాం అన్నారు. రైతులను అరగోస పెడుతున్నారని కనీసం యూరియా ఇవ్వాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఎరువుల కోసం యాప్ పెడితే రైతులు తిరిగి తిరిగి వాళ్ల కాళ్లకు వాపులు వచ్చాయి అన్నారు. జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు ఇప్పుడే అప్పజెబుతున్నానని తెలిపారు. జీవన్ అన్న సేవలు పార్టీకి అవసరమన్నారు. మన హైడ్రా అడ్రస్ లేకుండా చేస్తా అన్నారు. హైదరా పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేదల ఇండ్లు పూల కొట్టిన వాళ్లకు పేదవాళ్లు ఉసురు కొట్టగా తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు జరిగారు.
ముందుగా జీవన్ రెడ్డికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు ప్రజాపాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News