Friday, 31 July 2026 08:34:03 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రాజకీయ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Date : 21 October 2025 11:39 AM Views : 325

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌ గాని కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలోని ఫామ్ అరవింద రిసార్ట్లో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న ఫామ్ అరవిందలో పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ మెలకువలు నేర్పించనున్నామన్నారు. రాజకీయ శిక్షణ శిబిరాలను మంథని డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల యాదవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని మల్లేషం యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంథని మండల అధ్యక్షుడు పరుషవేని మోహన్ యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్, గోకుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, కార్యవర్గ సభ్యులు శీలారం పర్వతాలు, కార్యదర్శి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మంథని మండల ఉపాధ్యక్షులు కనగంటి ఓదెలు యాదవ్, వేముల లక్ష్మయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ శ్రీనివాస్, కనెవేన శ్రీనివాస్ యాదవ్, జాగరి సదానందం యాదవ్, కనవేన కొమురయ్య యాదవ్, కనవేన రమేష్ యాదవ్, మోత్కు రాజబాబు యాదవ్, జక్కుల కుమార్ యాదవ్, మాదరవేన ఓదెలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :