ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైంది. కేసీఆర్ మీద కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హై కోర్టు ముందు చెల్ల లేదన్నారు. జస్టిస్ పి సి ఘోష్ కమిషన్, కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని న్యాయస్థానం తెలంగాణ సహకార సంఘం మాజీ చైర్మన్ రాజా వరప్రసాదరావు స్పష్టం చేసిందన్నారు. కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు అని బల్లగుద్ది చెప్పడం జరిగిందన్నారు. హై కోర్టు వెలువరించిన తీర్పు తాత్పర్యం ఏమిటంటే.. సాక్షులుగా పిలిచిన ( కేసీఆర్ తదితరులు) వారి మీద చర్యలు చేపట్టడం కుదరదని చర్యలు తీసుకోవాలని అనుకుంటే వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు వారి వాదనలుకూడా వి నాలన్నారు. అటువంటివి ఏమీ లేకుండా సాక్షులుగా పిలిచిన వారిని విచారణ పేరుతో అగౌరవ పరుస్తూ, ఏకపక్షంగా ఉద్దేశాలు ఆపాదిస్తూ, తప్పు పడుతూ, తలకాయ తోక లేకుండా వ్యవహరించడం తప్పు కాదా అని విమర్శించారు. చట్టం న్యాయ వ్యవస్థ పట్ల కనీస అవగాహన లేని కమిషన్ నివేదిక తప్పుల తడక అన్నారు. అటువంటి అసంబద్ధమైన పి సి ఘోష్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్రమే కానీ, సి బి ఐ ఇంకెవరైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదన్నారు. హై కోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పునివ్వడం గమనార్హం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వంపై మచ్చ వేయాలనే ఉద్దేశంతో కమిషన్ను ఉపయోగించిన విధానం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసిం దన్నారు. కమిషన్ విచారణ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని, సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంవారి వాదనలు వినకపోవడం వంటి లోపాల వల్ల ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదని కోర్టు తేల్చిచెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణం అన్నారు. ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలనే ప్రయత్నాల మధ్య వచ్చిన ఈ తీర్పు కేసీఆర్ , హరీశ్ రావుల పై చేసిన ఆరోపణలు తప్పుడువి అనే తేల్చిందన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలను విరమించుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కాలేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యవసాయానికి సాగునీటిని అందించాలి రైతాంగం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా మరణం చేయాలని చూసినా చివరికి ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.
Admin
E Nivas News