Thursday, 30 July 2026 04:34:49 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విద్యార్థినులకు బహుమతులు ప్రధానం చేసిన మాజీ జెడ్పిటిసి మూల సరోజన రెడ్డి

Date : 03 January 2026 06:52 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సామాజిక సేవలో సావిత్రిబాయి పూలే అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన బి శ్రీ లాలిత్య హెచ్ ఇ సి ఫస్ట్ ఇఇయర్, శ్రీనిధి ఎంపీసీ సెకండ్ ఇయర్, కె అభినయ హెచ్ఈసి సెకండియర్ విద్యార్థినులను మాజీ జెడ్పిటిసి మూల సరోజన రెడ్డి శాలువాతో సన్మానించి మెమొంటోలు ప్రధానం చేసి మహిళ అధ్యాపకులు కే ఝాన్సీ, ఎం శ్రీదేవి, సబితా, మౌనికలను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మూల సరోజన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని సంఘసంస్కర్త కవయిత్రి మహిళలకు చదువు నేర్పిన చదువుల తల్లి అని పేర్కొన్నారు. అనేక పాఠశాలలు నెలకొల్పి మహిళలకు విద్యను అందించారని వితంతు వివాహాలను ప్రోత్సహించారని బాల్య వివాహాలను రూపుమాపారన్నారు. అనాధ ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన గొప్ప మానవతావాది అని, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ఆమె బాటలో నడవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ జేఏసీ నాయకుడు బెజ్జంకి. డి గంబర్ కళాశాల లెక్చరర్స్ బి శ్రీధర్ రావు, ఆర్ తిరుమల్, ఎల్ఆర్కే రాజేశ్వరరెడ్డి, సిహెచ్ నగేష్ లతోపాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :