ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదు నగర అభి వృద్ధిలో మరో కీలక అడు గు పడింది,మహా నగర ప్రజలకు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం శాస్త్రి పురం ఫ్లై ఓవర్ రైల్వే బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవ ర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ కూడా విప రీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్- ఫలక్నుమా- శివరాంపల్లిరైల్వే లైన్లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద ఈ భారీ ప్లైవోర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్నునిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో ఉన్న ఈ ఫ్లైఓవర్ మైలార్దేవ్ పల్లిని ఫలక్నుమా ఆర్టీసీ బస్ డిపోతో కలుపుతుం ది.ఈ ఫ్లైఓవర్ అందుబాటు లోకి రావడం వల్ల పాత బస్తీ, పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుం ది.దీంతో మైలార్దేవ్పల్లి – వట్టేపల్లి – ఫలక్నుమా మార్గంలో ప్రయాణ సమయం దాదాపు 30 నిమిషాలు తగ్గుతుంది. అలాగే గతంలో మాదిరి రైల్వే క్రాసింగ్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాహనదారులకు విముక్తి లభిస్తుంది. దీంతో ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనదారులకు సాఫీగా రాకపోకలు సాగించవచ్చు. అంతేకాదు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రయాణం సాఫీగా సాగడంతో పెట్రోల్ వినియోగం తగ్గడమే కాకుండా, వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గు తుంది. కాబట్టి ఈ ప్లైఓవర్ ఓల్డ్ సిటీ వాసులకు ఎంతో ఉపశమనాన్ని కలింగించ నుంది. అలాగే ఇది సమీప ప్రాంతాల ఆర్థిక ఆభివృద్ధికి కూడా తోల్పడుతుంది.
Admin
E Nivas News