ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వెంకట్రావ్ పేట సేవా సమితి (వీ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు బెంచ్ లు,వాటర్ ఫ్యూరిఫైయర్ లను శనివారం వి ఎస్ ఎస్ సభ్యులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ నలిమేల రాజు మాట్లాడుతూ సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమన్నారు. సేవా భావం చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వెంకట్రావ్ పేట సేవా సమితి కార్యక్రమాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమితి సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తే తమకు ఏదో ఒకరోజుఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సమాజం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్నారు. పలువురు దాతల సహకారంతో రూ. 2 లక్షల 25 వేల విలువ గల డెస్క్ బెంచీలను, వాటర్ ఫ్యూరి ఫైయర్ ను ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు సమితి ఆధ్వర్యంలో అందించమన్నారు. అనంతరం సావిత్రి భాయ్ ఫూలే జయంతిని పురస్కరించుకొని పాఠశాలల మహిళల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సరోజ, ఏంఈఓ శైలజ, ఎస్సై సురేష్, మీస శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News