Friday, 17 April 2026 03:46:08 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు...

Date : 13 April 2026 08:28 PM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు సర్వీస్ సమస్యలు బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించక పోవడం వల్ల సమ్మె ఆందో ళన తీవ్రత మరింత పెరుగ నుంది.ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు లేబర్ కమిషనర్‌తో భేటీ కానుండటంరాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభు త్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చ లకు పిలవకపోవడంపై జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కమిషనర్‌తో జరిగే చర్చల అనంతరం సమ్మెపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తమ డిమాండ్ల విషయం లో వెనక్కి తగ్గేదే లేదని, ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది. లక్షలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :