ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని శ్రీ అయ్యప్ప దత్తగుడి దేవాలయాల నుండి CRK కాంప్లెక్స్ మీదుగా తమ్మి చెరువు కట్ట వరకు, CRK కాంప్లెక్స్ నుండి ఎరుకల గూడెం హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు పూర్తిగా చెడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మతుకు డ్రైనేజీల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రోడ్లు, డ్రైనేజీ పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించే మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News