Friday, 17 April 2026 05:03:41 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆమోదం

సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజ్ పనులపై మంత్రికి సురేందర్ రెడ్డి విన్నపం

Date : 08 October 2025 04:01 PM Views : 249

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని శ్రీ అయ్యప్ప దత్తగుడి దేవాలయాల నుండి CRK కాంప్లెక్స్ మీదుగా తమ్మి చెరువు కట్ట వరకు, CRK కాంప్లెక్స్ నుండి ఎరుకల గూడెం హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు పూర్తిగా చెడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మతుకు డ్రైనేజీల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రోడ్లు, డ్రైనేజీ పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించే మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :