Friday, 31 July 2026 04:35:20 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

స‌జ్జ‌నార్‌కు పదోన్నతి..

Date : 25 April 2026 05:48 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా, వీవీ శ్రీ‌నివాస‌రావు, చారు సిన్హా, అనిల్‌ కుమార్‌, వీసీ స‌జ్జనార్ ఉన్నారు. ప్ర‌స్తుతం వీరంతా ఏడీజీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా వీరిలో ఒక్క స‌జ్జ‌నార్ మిన‌హా ఎవరి విష‌యాన్నీ నెటిజ‌న్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి.హైద‌రాబాద్ కొత్వాల్‌గా ఉన్న స‌జ్జ‌నార్‌పై మాత్రం ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున డిబేట్ జ‌రుగుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. కేవ‌లం తెలంగాణ నెటిజ‌న్లే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణకు చెందిన వారు ఆయ‌న సొంత రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు చెందిన వారు కూడా స‌జ్జ‌నార్‌పై విషెస్ వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆయ‌న మ‌రిన్ని ప‌ద‌వులు అలంక‌రించాల‌ని కోరుతున్నారు. ఇలా ఒక పోలీసు క‌మిష‌న‌ర్‌కు ప‌దోన్న‌తి క‌ల్పించాక‌భారీ స్థాయిలో విషెస్‌రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటున్నారు. పోలీసు క‌మిష‌న‌ర్ కాక‌ముందు ఆయ‌న ఎస్పీగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆర్టీసీ ఎండీగా కూడా ప‌నిచేశారు. ఆయా స‌మ‌యాల్లో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు వేసిన అడుగులు స‌మాజంలో స‌జ్జ‌నార్‌కు ప్ర‌త్యేక గుర్తింపుతోపాటు ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక అభిమానాన్ని కూడా పొందుప‌రిచాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డే వారిని క‌ఠినంగా ఆయ‌న అణిచివేశారు. ఇది మ‌హిళా లోకాన్ని ఆయ‌న‌వైపు చూసేలా చేసింది. ఆర్టీసీఎండీగా ఉన్న‌ప్పుడుఆ ప‌ద‌వికి వ‌న్నెతెచ్చారు. అస‌లు ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం ఉండ‌ని ఆర్టీసీ ఎండీ పోస్టును ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా స్పందించేవారు. ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేసేవారు. ఇక‌, హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా డ్ర‌గ్స్ స‌హాఐబొమ్మ ర‌వి వంటివారిపై ఉక్కుపాదం మోపి అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకున్నారు. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. వీట‌న్నింటికీమించి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని చేరువ చేశారు. ఎవ‌రైనా స్వేచ్ఛ‌గా కార్యాల‌యంలోకి వ‌చ్చి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. మ‌రీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న సోష‌ల్ మీడియాను వ‌ద‌ల్లేదు. స‌మయసంద‌ర్భం ఏది ఉన్నాఆయ‌న వెంట‌నే సోష‌ల్ మీడియాకు క‌నెక్ట్ అవుతారు. ప్ర‌జ‌ల‌కు -స‌జ్జ‌నార్‌కు మ‌ధ్య బాండింగ్ పెంచాయి. ఇదే ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌గా మారింది. సాధార‌ణంగా వ‌చ్చే ప్ర‌మోషనే అయినాఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మంచి పనుల వల్లనే అతనికి మంచి అవకాశం దక్కిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :