Thursday, 30 July 2026 11:12:04 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం...

Date : 18 March 2026 07:44 AM Views : 211

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి కూడా సభకు గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన వస్తారని అందరూ భావించినా, కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు సభలో నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన 'హిల్ట్ పాలసీ'ని గవర్నర్ ప్రస్తావించగానే ఇది పెద్ద కుంభకోణమని హరీశ్‌రావు హిందీలో అరిచారు. పెట్టుబడుల సమ్మిట్‌పై గవర్నర్ చదువుతున్న అంశాలన్నీ అబద్ధాలని, ప్రభుత్వం ఆయనతో తప్పుడు మాటలు చెప్పిస్తోందని ఆరోపించారు. సభలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ కండువా లేకుండానే సభకు హాజరయ్యారు. వారంతా అధికార కాంగ్రెస్ సభ్యుల పక్కనే కూర్చోవడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమ పార్టీ కండువాలతో మెరవగా, మజ్లిస్ సభ్యులు సంప్రదాయ షేర్వానీలతో కనిపించారు. అసెంబ్లీ లాబీల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే చేదు అనుభవం ఎదురైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణలను గన్‌మెన్లు అడ్డుకున్నారు. సీఎం చాంబర్ వద్ద కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవని, తమను లోపలికి వెళ్లనివ్వకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో మరో ఎమ్మెల్యే విజయరమణారావును మాత్రం గన్‌మెన్లు అడ్డుకోకపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: