ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 18వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాల పోస్టర్లను గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల బంజారా, లాంబాడా సోదరులు ఉత్సవాలకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమాజం యొక్క కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాథోడ్ భీంరావ్ నాయక్, అధ్యక్షులు జాదవ్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి వినాయక్ రావ్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News