ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం వేదికగా సోమవారం మంథని పట్టణంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా, విజయవంతంగా సాగింది. పాత ఇండియన్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో సుమారు 100 బైక్లపై హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసరి ధ్వజాలతో, 'జై శ్రీరామ్' నినాదాలతో మంథని పురవీధులు మారుమోగాయి. ఈ సందర్భంగా కెక్కర్ల అనిల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు సంఘటితంగా లేకపోవడం వల్లే, నాస్తికుల పేరుతో కొందరు హిందూ ధర్మాన్ని, పవిత్ర గ్రంథాలను విమర్శించే సాహసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మనం కేవలం పుట్టుకతో హిందువులుగా ఉంటే సరిపోదు, ప్రతి హిందువులో హిందుత్వ భావజాలం ఉండాలి. హిందుత్వ వాదులుగా మేల్కొన్నప్పుడే ధర్మాన్ని రక్షించుకోగలం. హిందువులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకే ఈ విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
*29న భారీ బహిరంగ సభ* ఈ నెల 29వ తేదీన మంథని కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించబోయే *"విరాట్ హిందూ సమ్మేళనం"* కార్యక్రమానికి హిందూ బంధువులందరూ వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం సభ్యులు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్, కనుకుంట్ల స్వామి , తూర్పాటి రాము, తోండ్ల సంతోష్, బొడ్డు సతీష్, మాడిశెట్టి సుదర్శన్, కొమురవెల్లి హరీష్, మాడిశెట్టి సురేందర్, చొప్పర రమేష్, కొండ తిరుపతి, రోడ్డ రాజేశ్వర్ రావు,దువ్వ తిరుపతయ్య చిలువేరి సతీష్, నాంపల్లి రమేష్ మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News