ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని నుండి మేడారం మహా జాతరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభమయ్యయి. మహా జాతర ప్రత్యేక బస్సులను అధికారులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మంథని నుండి మేడారంకు పెద్దలకు రూ. 350, పిల్లలకు రూ. 210 చార్జి ఉంటుందన్నారు. మహా జాతర ప్రత్యేక బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. టీజిఎస్ఆర్టిసి బస్సులు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరి వరకు వెళుతాయని, ప్రవేట్ వాహనాలు గద్దెలకు దూరంగా వెళ్తాయని పేర్కొన్నారు. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ గోపాల్, గణేష్, కెఆర్ రావ్, జగదీష్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News