ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సహకార బ్యాంకు (కేడీసిసి) డిపాజిట్ పథకాలను ప్రజలు సద్వినియోగo చేసుకోవాలని బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు కోరారు. కేడీసిసి బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు,ఏజీఎంలు ఇంతియాజ్ ఆలీ, లోకే రాజశేఖర్, మేనేజర్ ఉదయశ్రీ, బ్యాంకు, సహకార సంఘం సిబ్బంది మంథని పట్టణంలో ఇంటింటా తిరుగుతూ కేడీసిసి డిపాజిట్ పథకాలపై అవగాహన కల్పిస్తూ డిపాజిట్ లు సేకరించారు. ఈ సందర్భంగా కేడీసిసి బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు మాట్లాడుతూ సహకార బ్యాంకు చేసే డిపాజిట్ల పై ఖాతా దారులకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. ఇతర బ్యాంకు లకంటే ఎక్కువగా సహకార బ్యాంకు లో డిపాజిట్స్ పై అధిక వడ్డీ రేటు పొందవచ్చని తెలిపారు. 333రోజులకు గాను సాధారణ పౌరులకు వడ్డీ రేటు 8శాతం, సీనియర్, మహిళలకు అత్యధికంగా 8.50శాతం వడ్డీ రేటు ఉందని, దీనిని ప్రజలు, ఖాతాదారులు ఉపయోగించుకోవాలని కోరారు. అంతే గాకుండా బ్యాంక్ ద్వారా దీర్ఘకాలిక, గోల్డ్ లోన్స్, హౌజింగ్ లోన్స్, విదేశీ విద్యా ఋణాలు, మార్టిగేజ్ ఋణాలు, ఎస్ హెచ్ జి, జెఎల్ జి ఋణాలు, అలాగే ఇళ్ల రిపేరుకు, ఇంటిరియర్ డెకరేషన్ కు, పిఎంఇజిపి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఋణాలు సేరి కల్చర్, ఆయిల్ ఫాం తోటల పెంపకానికి ఋణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంక్ ద్వారా ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా పథకాలను ఖాతాదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డిఈ లు సందేబోయిన శ్రీనివాస్, దిలీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు మాచిడి శ్రీనివాస్, పోతరాజు సతీష్ కుమార్, బూడిద వసంత, కీర్తన, లాస్య, బ్యాంకు సిబ్బంది మహేందర్, అమరేందర్, మహేశ్వరి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, దుబ్బాక సదాశివ్, నారమల్ల విద్యాసాగర్, బొద్దుల సమ్మయ్య, పైడాకుల రాకేష్, గుడెల్లి మధుమోహన్, మోతుకూరి శేఖర్, రాగం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News