Friday, 31 July 2026 07:24:51 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సహకార బ్యాంకు డిపాజిట్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

డీజిఎం బ్రహ్మానంద రావు

Date : 22 October 2025 05:36 PM Views : 715

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సహకార బ్యాంకు (కేడీసిసి) డిపాజిట్ పథకాలను ప్రజలు సద్వినియోగo చేసుకోవాలని బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు కోరారు. కేడీసిసి బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు,ఏజీఎంలు ఇంతియాజ్ ఆలీ, లోకే రాజశేఖర్, మేనేజర్ ఉదయశ్రీ, బ్యాంకు, సహకార సంఘం సిబ్బంది మంథని పట్టణంలో ఇంటింటా తిరుగుతూ కేడీసిసి డిపాజిట్ పథకాలపై అవగాహన కల్పిస్తూ డిపాజిట్ లు సేకరించారు. ఈ సందర్భంగా కేడీసిసి బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు మాట్లాడుతూ సహకార బ్యాంకు చేసే డిపాజిట్ల పై ఖాతా దారులకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. ఇతర బ్యాంకు లకంటే ఎక్కువగా సహకార బ్యాంకు లో డిపాజిట్స్ పై అధిక వడ్డీ రేటు పొందవచ్చని తెలిపారు. 333రోజులకు గాను సాధారణ పౌరులకు వడ్డీ రేటు 8శాతం, సీనియర్, మహిళలకు అత్యధికంగా 8.50శాతం వడ్డీ రేటు ఉందని, దీనిని ప్రజలు, ఖాతాదారులు ఉపయోగించుకోవాలని కోరారు. అంతే గాకుండా బ్యాంక్ ద్వారా దీర్ఘకాలిక, గోల్డ్ లోన్స్, హౌజింగ్ లోన్స్, విదేశీ విద్యా ఋణాలు, మార్టిగేజ్ ఋణాలు, ఎస్ హెచ్ జి, జెఎల్ జి ఋణాలు, అలాగే ఇళ్ల రిపేరుకు, ఇంటిరియర్ డెకరేషన్ కు, పిఎంఇజిపి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఋణాలు సేరి కల్చర్, ఆయిల్ ఫాం తోటల పెంపకానికి ఋణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంక్ ద్వారా ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా పథకాలను ఖాతాదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డిఈ లు సందేబోయిన శ్రీనివాస్, దిలీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు మాచిడి శ్రీనివాస్, పోతరాజు సతీష్ కుమార్, బూడిద వసంత, కీర్తన, లాస్య, బ్యాంకు సిబ్బంది మహేందర్, అమరేందర్, మహేశ్వరి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, దుబ్బాక సదాశివ్, నారమల్ల విద్యాసాగర్, బొద్దుల సమ్మయ్య, పైడాకుల రాకేష్, గుడెల్లి మధుమోహన్, మోతుకూరి శేఖర్, రాగం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :