Friday, 31 July 2026 03:58:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా కాన్సిరాం జయంతి వేడుకలు

Date : 16 March 2026 07:44 AM Views : 297

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం అంబేద్కర్ కూడలి వద్ద బహుజన రాజ్యాధికార కాంక్షలు నిజం చేసిన మహనీయుడు కాన్సిరాం జయంతి వేడుకలు కాటారం బహుజన సంఘలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పంతకాని సడువలి మాట్లాడుతూ 1992 నాడు కాన్సిరాంతో కలిసి వేదికను పంచుకొని ఆయనతో కలిసి బ హుజన రాజ్య స్థాపన కోసం పనిచేయడం నాజీవితంలో నాకు దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన స్ఫూర్తితో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలమంతా కలిసి ఐ కమత్యంతో ముందుకు సాగుతూ కాన్సిరాం కళలను నిజం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నవుల్ల. సంపత్ మహారాజు మాట్లాడుతూ పొలి టికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనే సిద్ధాంతాన్ని నిజ జీవితంలో నిరూపించి బడుగు బలహీన వర్గాలైన పేద ప్రజలకు అధికారం రుచి చూపించిన మహనీయుడు కాన్సిరాం నిచ్చెన మెట్ల వ్యవస్థ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, కూలదోషి అందరూ సమానమని చెప్పే అటువంటి స మానత భావం కోసంతన జీవితాన్ని అర్పించిన మహనీయుని జయంతి వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలైన ప్రజలకు అధికారం అందజేసే బాధ్యతను భాగంగానే ఇంతమంది పెద్దల మధ్య ఈ వేడుక ఇంత ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు జక్కు శ్రావణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల చరిత్ర తప్ప మరో మహానీయుని చరిత్ర తెలియకుండా కొద్ది మంది కుట్ర చేశారని అయిన కూడా అరచేతినీ అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అనేవిధంగా మహానీయుల చరిత్ర గుండె గుండెకు చేరుతుందని ఈ వాస్తవాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో మనెం రాజబాబు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బోడరాజు బొబ్బిలి వెంకన్న. సంజీవని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టే సతీష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ రఫీ, బిజెపి సీనియర్ నాయకులు బొడ్డు రాజబాబు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండం మల్లారెడ్డి. బహుజన యువ నాయకులు గోనె మహేష్, జాడీ శేఖర్, శ్రీరాముల రజనీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :