ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా లక్షెట్టిపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎమ్మెల్యే సహకారంతో పట్టణానాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ కార్యక్రమంలో దొంత నర్సయ్య, సురేష్ నాయక్, సూరం చంద్రమౌళి, గోప చిన్న రమేష్, రాందేని వెంకటేష్, పెద్ద వెంకటేష్, రాందేని తిరుపతి, లచ్చన్న, వడ్డేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News