ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై పోలీస్ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్, శ్వేత ఆదేశించారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని భరోసాని కలిగించాలని, ఆమె సూచించారు. వెస్ట్జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం సందర్శించారు. ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు వెస్ట్జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్,పూల మొక్కను అంద జేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు, స్టేషన్ పరిధిలో తరుచు జరిగే నేరాలు, స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రస్తుత గ్రామాల్లో స్థితిగతులు, స్టేషన్ నిర్వహణ, పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్స్పెక్టర్ వేణును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అధికారులు, సిబ్బంది ఉద్యేశిస్తూ పోలీస్ కమిషనర్ మాట్లాడు తూ ప్రజల కోసం పనిచేస్తున్నామని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని తో మర్యాదపూర్వకం గా వ్యవహరించాలని, ఆమె సూచించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు ఫిర్యాదు దారునికి రశీదు అందజేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులను పోలీస్ స్టేషన్ ఎక్కువ సేపు వేసి వుండే పరిస్థితి రాకుండా స్టేషన్ అధికారులు, సిబ్బంది చూడాలని ముఖ్యంగా రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Admin
E Nivas News