ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పి ఆర్ టీ యూ, ఫిబ్రవరి 9, 1971 న ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు అనేక GO లు సాధించి ఉపాధ్యాయ సంక్షేమం కోసం పాటుపడుతూ, ఉపాధ్యాయ మన్నన పొందిన మేటి సంఘంగా వుందని పి ఆర్ టీ యూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ ప్రస్థానంలో పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాలతో సమానంగా అన్ని సౌకర్యాలు సాధించామని, 010 సాలరీ, ప్యానెల్ గ్రేడ్ పదోన్నతులు, సెలవులు, జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు, ఎంఈవో, డిప్యూటీ డీఈవో పదోన్నతులు, ఉమ్మడి సర్వీస్ రూల్స్, మహిళలకు 5 ప్రత్యేక సెలవులు, పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్, అప్రెంటిస్ ఉపాధ్యాయులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్, 398 స్పెషల్ పే కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్, అప్రెంటిస్ రద్దు, మెరుగైన పిఆర్సి లు, ఇలా అనేక జీవో లు సాధించి అహిర్నసలు ఉపాధ్యాయ సంక్షేమం కోసం పాటుపడుతూ, నేటితో 55 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ రోజు పి ఆర్ టీ యూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పరిధిలోని, ఎస్.ఆర్.బీ.సీ. కాలనీలో ఉన్న, మానవత నిలయం వృద్ధాశ్రమంలోని, వృద్ధులకు పండ్లు, ఫలాలు అందించి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, ఎస్.వి.రామిరెడ్డి, దామరేకుల రవి , జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొహినుద్దీన్, పాములపాడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.సాంబ శివుడు, పి.హరినాథ్ బాబు, జిల్లా నాయకులు ఖాజా, రఫీక్, శివయ్య మండల కార్యవర్గ సభ్యులు నరేష్, సమ్మద్, అర్షద్. మహబూబ్, కరీం, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News