Sunday, 26 April 2026 02:12:32 AM
# భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్ # ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు. # ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం.. # ఈ నెల 27న ప్రజావాణి రద్దు # ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

పాఠశాల భవనం నిర్మించాలనీ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్

Date : 22 April 2026 06:25 AM Views : 63

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారను, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ ‌, బయ్యన్న పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :